కొత్త జిల్లాల ఏర్పాటుతో జోష్ మీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ 2019 ఎన్నికలే టార్గెట్గా వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం మంత్రి వర్గ విస్తరణకు సైతం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలను అప్పగించి క్షేత్రస్ధాయి నుంచి కేడర్ను బలోపేతం చేయాలని ఆలోచిస్తున్నారు. విధేయులకు ఈ సారి జరిగే విస్తరణలో న్యాయం జరుగుతుందనే ఊహగానాలు వినిపిస్తుండటంతో ... గులాబీ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు ప్రారంభించారు.