ఛత్తీస్గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నయా రాయ్పూర్లో పర్యటిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ ఫొటోగ్రాఫర్గా మారిపోయారు. ఛత్తీస్గడ్ రాష్ట్ర సీఎం రమణ్సింగ్తో కలిసి అక్కడి నందన్వన్ జంగల్ సఫారీని తిలకించిన మోదీ ఓ కెమెరాను తీసుకుని, బోనులో ఉన్న పులిని ఫొటో తీశారు. ఈ సమయంలో ఆ పులి మోదీని అదేపనిగా చూడడం విశేషం. పులిని వివిధ భంగిమలలో ఫోటోలు తీయడం కోసం పలురకాలుగా మోదీ ప్రయత్నించారు. పులి కూడా ఆయన ఫొటోలు తీస్తుండగా ఏమాత్రం కదలకుండా ఉండి పోయింది. మోదీ కెమెరా పట్టుకొని ఫొటో