చైనా కూడా మరోసారి హద్దు దాటింది. వాస్తవాధీన రేఖ వెంబడి జమ్ములోని లే జిల్లా డెమ్చోక్ ప్రాంతంలోకి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు చొచ్చుకొచ్చినట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. సరిహద్దులో గస్తీ కాస్తున్న ఇండో టిబిటెన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలకు వారు ఎదురు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం వాస్తవాధీన రేఖకు దగ్గరగా వచ్చారని, తిరిగి వెళ్లడానికి వారు నిరాకరించారని ఆ అధికారి వివరించారు.