ఆర్ధిక ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. చెత్త తరలించే వాహనాల ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని యోచిస్తోంది. అందుకే ఆ వెహికిల్స్ రూపురేఖలను మార్చేస్తోంది. ప్రజారోగ్య నినాదాలు, ప్రకటనలతో చెత్త వాహనాలను నింపేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఓ యాడ్ ఏజెన్సీకి టెండరు కూడా కట్టబెట్టింది.