రాజకీయ పరిణామాల్లో చాలా మందస్తు ఆలోచనతో ఉండే ఏపీ సీఎం చంద్రబాబు... ఈ క్రమంలో మరో అడుగు వేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగనున్న పురపాలక వేడి ప్రారంభం అవుతున్న దశలో ఉండగానే... 2017 మార్చిలో జరగనున్న పట్టభద్రులు - ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. యథావిధిగానే తెలుగుదేశం ఆధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మక పావులు కదుపుతున్నారు.