కేంద్రం రద్దు చేసిన రూ.500 నోట్లు,రూ.1000నోట్లు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. నల్లధనం వెలికితీసి తద్వారా దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మోడీ పదేపదే చెబుతున్నారు. మోడీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఆయన నిర్ణయం తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందని కొందరు విమర్శిస్తున్నారు