ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమిపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా మంగళవారం జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ యంత్రాంగం తీరును తప్పుపట్టింది. మౌలిక వసతులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి సారథ్యం వహించిన అశోక్ గుప్తా తన వాదనలు ప్రారంభిస్తూ ‘ఆంధ్రప్రదేశ్లోని కడపలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు మంజూరు