ఒకప్పుడు వారంతా ఓ వెలుగు వెలిగిన నేతలు, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహించిన నాయకులు, తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పొలిటీషియన్స్, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ముఖ్య భూమిక పోషించిన ఘనులు. కానీ గత కొంతకాలంగా వారెవ్వరూ తెరపై కనిపించడం లేదు. అనునిత్యం వార్తల్లో నిలిచిన వారు ఇప్పుడేమయ్యారు. ఏం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలోఉన్నప్పుడు కూడా జనాల్లోకి ఎందుకు రావడం లేదు. కనీసం గాంధీ భవన్ గడప ఎందుకు తొక్కడం లేదు..?ఇలా ఎన్నో ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణులను, కార్యకర్తలను వేధిస్తున్నాయి.