జయలలితను తమిళ ప్రజలు ఇప్పుడప్పుడే మర్చిపోయేలా లేరు. ఆమె ఆస్పత్రిలో జాయిన్ అని నాటి నుంచి ఆమెను చూసేందుకు అక్కడ బారులు తీరారు. ఆమె తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాకా.. కడసారి చూసేందుకు కూడా భారీగా తరలివచ్చారు అమ్మ అభిమానులు. ఇప్పుడు జయ సమాధి స్థలాన్ని సందర్శించేందుకు కూడా పెద్ద ఎత్తున్న వస్తున్నారు ప్రజలు. దీంతో ఆ ప్రాంతమంత జనంతో కిక్కిరిసిపోతోంది. అయితే బుధవారం తమిళ ప్రజలు మరోసారి అమ్మను చూసినంత ఉద్విగ్నానికి లోనయ్యారు.