తన సర్వీసు తుపాకీతో కాల్చుకొని సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరులో ఎస్సై ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. ఫిల్మ్నగర్లోని ఆర్జే ఫొటోగ్రఫీలో మంగళవారం సూసైడ్ చేసుకున్న బ్యూటీషియన్ శిరీషతో ఎస్ఐ ప్రభాకర్రెడ్డికి సంబంధం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రభాకర్ ఆత్మహత్య కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులకు గత కొంతకాలంగా ప్రభాకర్ రెడ్డికి శిరీషతో పరిచయం ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు మద్యం మత్తులో శిరీషపై ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరులో ఎస్సై ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకోవడం పట్ల పోలీసు అధికారులు చెబుతున్న కారణాలపై ఆ గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ రోజు మీడియాలోనూ ఇటువంటి కథనాలే రావడంతో ఆ వార్తలను ఖండిస్తూ ఆందోళనకు గ్రామస్తులు దిగారు. ప్రభాకర్రెడ్డి ఎంతో మంచి వ్యక్తని, కుకునూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని 26 గ్రామాల ప్రజలకు ఆయన ఎటువంటి వాడో తెలుసునని అంటున్నారు. పోలీసులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు.
టీషియన్ శిరీషకు, ప్రభాకర్ ఘటనకు సంబంధం ఉందంటూ పోలీసులు చేస్తోన్న ఆరోపణలపై శిరీష భర్త సతీశ్ చంద్ర స్పందించారు. అయితే, తనకు ఎవరిపైనా అనుమానం లేదని, అందుకే అనుమానాస్పద మృతిగానే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. దీనిపై విచారణ చేయాలని పోలీసులను కోరినట్టు చెప్పారు. తన భార్య మృతిపై గంటకో వార్త బయటకు రావడంతో తనకేమీ అర్థం కావడంలేదని వాపోయారు. తనతో శిరీష బాగా ఉండేదని, ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు.