సింహాల గుంపు మధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఒక మహిళ. సింహాల గుంపేంటి..? మహిళ ఎందుకు ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉంది..? అనేగా మీ సందేహం. మీ సందేహం తీరాలంటే ఈ న్యూస్ ని పూర్తిగా చదవాల్సిందే. బుధవారం రాత్రి గుజరాత్‌లోని అమెరేలి జిల్లా జఫ్రాబాద్ తాలుకా లన్సాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నిండు గర్భిణి అయిన మహిళకు బుధవారం రాత్రి అకస్మాత్తుగా నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. 


పండంటి బిడ్డకు జననం.. చుట్టుముట్టిన సింహాలు

ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేది సింహాలకు ప్రసిద్ధిగాంచిన గిర్‌ ఫారెస్ట్‌ ప్రాంతం నుంచే. దీంతో వారు వెళ్లే సమయంలో అదే మార్గంలో తొలుత మూడు సింహాలు వారి వాహనాన్ని అడ్డగించాయి. ఆలోపే వరుసగా పన్నెండు సింహాలు వారి వాహనాన్ని చుట్టుముట్టాయి. దీంతో అంబులెన్స్‌ను నిలిపివేశారు. పులులు అక్కడి నుంచి వెళ్లాక బయలుదేరాలని నిర్ణయించారు. అయితే అవి ఎంతసేపటికీ కదల్లేదని జిల్లా 108 అంబులెన్స్ సేవల చీఫ్ చేతన్ గధియా తెలిపారు.అదే సమయంలో మహిళకు రక్త స్రావం మొదలైంది.


Image result for lions

పులులు రోడ్డుపై నుంచి కదిలే సూచనలు కనిపించకపోవడంతో అంబులెన్స్‌లోనే మహిళకు ప్రసవం చేయాలని అంబులెన్స్ సిబ్బంది నిర్ణయించారు. అంబులెన్స్ లోనే ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అంబులెన్స్ డ్రైవర్ నెమ్మదిగా వాహనాన్ని ముందుకు కదిలించాడు. ముందుకు వస్తున్న వాహనాన్ని చూసి సింహాలు కూడా నెమ్మదిగా రోడ్డు పై నుంచి కదిలాయి. దీంతో మహిళ, ఆమె శిశువును జఫ్రాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: