ఫైర్ బ్రాండ్గా మారేపనిలో పడ్డ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శల జడివాన గుప్పించే రోజా ఇప్పుడు పవన్ కళ్యాణ్పై ఘాటుగా విమర్శలు గుప్పిస్తోంది. కులాన్ని ప్రస్తావిస్తూ పవన్ను ఇరకాటంలో పెట్టె ప్రయత్నం చేస్తోంది. అయితే పవన్ను రోజా ఎందుకు టార్గెట్ చేస్తుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టిడిపికి ఓటేయమని ప్రజలను అడిగారని.. కానీ ఇప్పుడు తన కాపు సోదరులు అన్యాయం అయిపోతుంటే ఆ హీరో ఎక్కడికి పోయారని రోజా ప్రశ్నించారు. తన కాపు సోదరుల అక్రమంగా అరెస్టులు చేస్తుంటే.. ప్రశ్నించడానికి తానున్నాని చెప్పిన పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడని రోజా మండిపడ్డారు. చేనేత కార్మికులు సభ పెట్టుకుంటే అక్కడికి వెళ్లి.. నేనే చేనేత బ్రాండ్ అంబాసిడర్ ని అని ప్రకటించుకున్న పవన్ ఇప్పుడు ఎక్కడున్నాడని రోజా ప్రశ్నించారు. జీఎస్టీ వలన చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారవుతుంటే పవన్ కనీసం ట్విట్టర్ లో కూడా స్పందించలేదని రోజా అన్నారు. ఇప్పటికైనా పవన్ లబ్బర్ సింగో, గబ్బర్ సింగో తేల్చుకోవాలని రోజా సెటైర్లు విసిరారు.
అయితే రోజా పవన్పై విమర్శలు చేయడం వెనుక అసలు వ్యూహం ఏంటనే విషయంపై ఇప్పుడు ఆసక్తిగా మారింది. పవన్ పార్టీలోకి వెళతారనుకున్న రోజా.. ఇప్పుడు ఆయననే టార్గెట్ ఎందుకు చేస్తోంది? అనే ప్రశ్న వినిపిస్తోంది. తెలంగాణలో కీలకమైన చేనేతకార్మికులకు, అలాగే ఏపీలో పెద్ద సామాజికవర్గమైన కాపులకు మద్దతుగా మాట్లాడి వారికి దగ్గరవ్వడం, ఆ తర్వాత పవన్.. ఇటు చేనేతలకు, అటు కాపులకు సపోర్టుగా నిలబడతానని మాట్లాడి వారికి భరోసా కలిగించడం, ఆ తర్వాత రోజా జనసేనలోకి ఎంట్రీ ఇవ్వడం.. ఇలాంటి వ్యూహమే రోజా అమలు చేయబోతోందని ఓ వైపు టాక్ వినిపిస్తోంది. ఏమో గుర్రం ఎగరినా ఎగరొచ్చు.