నందమూరి బాలకృష్ణ .. కోట్లాది అభిమానులు ఉన్న ఈ హీరో ఒక ఎమ్మెల్యే కూడా. అనేక విషయాల్లో, వివాదాల్లో నిలుస్తూ ఎప్పుడూ టీవీ ఛానల్ వారికి న్యూస్ ఐటెం అవుతూ ఉంటారు బాలయ్య. బయట చాలా సాఫ్ట్ మనిషి కానీ ఫాన్స్ నీ కార్యకర్తలనీ చూస్తే మాత్రమె బాలయ్య లోని రౌద్రం బయటకి వస్తుంది అంటూ ఉంటారు.

అయితే తాజాగా హీరో బాలకృష్ణ కొత్తగా 'విమర్శలు' చెయ్యడం మొదలు పెట్టారు. సాధారణంగా బాలకృష్ణ విమర్శల  విషయం లో పెద్ద సీరియస్ అవ్వరు .. ఏదైనా ఉంటె పాజిటివ్ గా తీసుకుని తాను ఏదైనా చెప్పాల్సి వస్తే టీడీపీ విశేషాలు చెప్పి సైలెంట్ అయిపోతారు. ఇతర టీడీపీ నాయకులతో పోల్చుకుంటే వైకాపా ని ఏకడం లో బాలయ్య ఎప్పుడూ సైలెంట్ అనే చెప్పాలి.

రీసెంట్ గా వైజాగ్ లో ఒక కార్యక్రమం లో పాల్గొన్న హీరో - ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైకాపా మీద విరుచుకుని పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం తో పోటీ పడే పరిస్థితి ఏ పార్టీ కీ లేదు అని గంభీరంగా మాట్లాడారు ఆయన. పొట్టేలు వచ్చి కొండని గుద్దినట్టు ఉంటుంది అనీ వైకాపా కి అసలు భవిష్యత్తే లేదు అని తేల్చి పడేసారు ఆయన.

ఉప ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పినా వైకాపా కి సిగ్గు లేదా అంటూ ఆయన ఆ రోజు చేసిన వ్యాఖ్యల వెనకాల చంద్రబాబు హస్తం ఉంది అంటున్నారు. ఆయనే కీ ఇచ్చి బాలయ్య ని ఆడిస్తున్నారు అనీ జగన్ పాదయాత్ర జరుగుతున్న టైం లో బాలయ్య తో విమర్శలు చేయిస్తే మీడియా గట్టిగా కవర్ చేస్తుంది అనేది బాబుగారి ప్లాన్ గా చెబుతున్నారు. పాదయాత్ర నేపధ్యం లో టీడీపీ ఫోకస్ అంతా జగన్ మీదనే పడుతోంది. చంద్రబాబు vs జగన్ పోటీ ని జగన్ స్థాయి తగ్గిస్తూ బాలయ్య vs జగన్ చెయ్యడానికి ప్రయత్నాలు అనుకుంట. 


మరింత సమాచారం తెలుసుకోండి: