టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అంటే ఎంతగానో అభిమానం చూపిస్తారు అభిమానులు. తండ్రికి తగ్గ తనయుడిగా నందమూరి బాలకృష్ణ ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించి మెప్పించారు. ఒకప్పుడు బాలయ్య నటించిన గ్రామీణ వాతావరణానికి సంబంధించిన సినిమాలో మువ్వగోపాలుడు, మంగమ్మ గారి మనవడు,ప్రెసిడెంట్ గారి అబ్బాయి,భానుమతిగారి మొగుడు,బాల గోపాలుడు ఇలా ఎన్నో సినిమాలు పల్లెటూరి చిత్రాల్లో నటించారు. పల్లెటూరి కుర్రోడిగా కనిపించే బాలకృష్ణ కి అప్పట్లో తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఎంతగానో నచ్చేవారు. ఇక తండ్రి బాటలో నడుస్తూ..బాలకృష్ణ రాజకీయాల్లో కూడా ప్రవేశించారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓ వైపు సినిమాలు తీస్తూనే..రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలను తన వియ్యంకుడు, ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం, నారా లోకేష్ బాబు, ఆయన సతీమణి, మనవడు, నందమూరి కుటుంబ సభ్యులతో సందడి నెలకొంది.
ఈ సందర్భంగా బాలకృష్న వినూత్నంగా సంబరాలు జరిపారు. పూలు, అరటి బోదెలతో అందంగా అలంకరించిన జోడెద్దల బండెక్కి, చర్నాకోలతో ఎడ్లను అదిలిస్తూ, నారావారి పల్లె వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఒకప్పటి మువ్వగోపాలుడు, మంగమ్మగారి మనవడు వచ్చాడని గ్రామస్థులు ఎంతో సంతోసం వ్యక్తం చేశారు. బాలకృష్ణ ఇప్పటికీ కుర్రాడిగానే ఎంతో ఎనర్టిటిక్ గా ఉన్నారని అందరూ తెగ పొగిడేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులను ఆప్యాయంగా పలకరిస్తూ, తన అభిమానులకు అభివాదం చేస్తూ సాగారు. ఆపై తిరుపతికి వచ్చి తన కొత్త చిత్రం 'జై సింహా'ను అభిమానులతో కలసి థియేటర్ లో కూర్చుని చూశారు. అతి త్వరలోనే ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను ప్రారంభించనున్నట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.