డబ్బు సంపాదనకోసం ఒక జ్యోతిష్యుడు ఏకంగా రాజకీయ నాయకుడిని బురిడీ కొట్టించి సంపాదించాలని అనుకున్న ప్రక్రియలో పోలీసులకు దొరికిపోయాడు. అసలు విషయం ఏమిటంటే విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన మురపాక కాళిదాసు మంచి  జ్యోతిష్యుడిని పేరుంది. జిల్లాలో చాలా మంది ప్రముఖులకి నాయకులకి జ్యోతిష్యం చెబుతూ భారీగా డబ్బు సంపాదించేవాడు. పోయిన సంవత్సరం నవంబర్ లో పార్వతీపురంలో కాళిదాసుశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సౌభాగ్య విద్యేశ్వరి పంచాయతన యాగంలో అచ్చెన్నాయుడు సతీ సమేతంగా పాల్గొన్నారు.

ఈ పరిణామంలో కాళిదాసు శర్మకి మంత్రి అచ్చెన్నాయుడు కి పరిచయం ఏర్పడింది మామూలుగా అచ్చెన్నాయుడు కి భక్తి శ్రద్ధలు, దేవుడి మీద నమ్మకం ఎక్కువ. ఈ క్రమంలో కాళిదాసు శర్మ ఇదే అదునుగా చేసుకొని డబ్బులు రాబట్టేందుకు మంత్రి అచ్చెన్నాయుడు కి ప్రాణహాని ఉందని కాళిదాసు శర్మ ప్రయత్నించాడు. అంతే కాకుండా దాన్ని నిజం చేసేందుకు అచ్చెన్నాయుడుని  నమ్మించేందుకు కాళిదాసు శర్మ ఒడిషా నుండి ఒక వ్యక్తి సాయంతో జిలిటెన్ స్టిక్స్ తెప్పించి మంత్రి ప్రయాణిస్తున్న దారిలో పెట్టించాడు.

ఈ సమాచారాన్ని విలేకరులకు ఫోన్ చేసి మంత్రి తిరిగే దారిలో బాంబు పెట్టినట్లు సమాచారం ఇచ్చారు. పోలీసులు అదే కూడలిలో జిలిటెన్ స్టిక్స్ గుర్తించారు.. అయితే ఆ తరువాత మంత్రిని చంపేస్తామని బెదిరించి డబ్బులు గుంజాలని ప్లాన్ చేశారు..అయితే బెదిరింపు కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు..సదరు జ్యోతిష్యుడిని సహకరిచిన వ్యక్తిని అరెస్టు చేసారు. ఈ సందర్బంగా మంత్రి అచ్చెన్నాయుడు కాక రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా జ్యోతిష్యుడు కాళిదాసుని నమ్మడం జరిగింది..ఇప్పుడు ఈ మొత్తం  తంతు చూసిన మంత్రులు నోరెళ్లబెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: