ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దూషించి విమర్శించి వార్తలు లో ప్రధానంగా నిలిచాడు. అయితే ఈసారి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శించారు కత్తి మహేష్. ఈ క్రమంలో బుధవారం చంచల్ గూడా జైలులో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ను కత్తి మహేష్ కలవడం జరిగింది.

ఈ సందర్భంగా  కత్తి మహేష్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి, దొరల పరిపాలన జరుగుతుందని కెసిఆర్ తెలంగాణ ప్రజలతో కొట్టించుకునే రోజులు దగ్గర్లో ఉన్నాయి అని కత్తి మహేష్ అన్నారు. అయితే ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కు తన పూర్తి మద్దతు ఉన్నట్లు వెల్లడించారు కత్తి మహేష్. కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి విమర్శలు చెయ్యని కత్తి మహేష్ ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ రెండు వరుస ట్వీట్లు విమర్శలు చేయడం జరిగింది.

దీనికి గల కారణం ఇటీవల ఓ పత్రిక కథనం ప్రకారం పవన్ అభిమానులు కత్తి మహేష్ సొంతూరు వెళ్లి ఆయన తండ్రిని కలిసినట్టుగా ఓ పత్రికలో కథనం వచ్చింది. ఆ కథనాన్ని ప్రస్తావిస్తూ మహేష్ ట్వీట్ చేశారు. అది పక్కన పెడితే తెరాస జోలికి అనవసరంగా వెళ్ళద్దు అంటూ మహేష్ సన్నిహితులే అతనికి సలహాలు ఇస్తున్నారట .. ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి లేనిపోని రిస్క్ తీసుకోవద్దు అంటూ అతని స్నేహితులు ఫోన్ లు చేసి మరీ చెబుతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: