ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జన్మభూమి కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి ఎంతో మైలేజ్ ఇచ్చింది. ప్రజలలో తెలుగుదేశం పార్టీ పట్ల నమ్మకం కూడా కలిగించింది, అలాగే ఆంధ్రప్రదేశ్  తెలుగు కార్యకర్తలలో ఉత్సాహం కూడా నింపడం జరిగింది. అయితే ఇదే క్రమంలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని తిరిగి బలపరచాలని సీఎం చంద్రబాబు నాయుడిని టి టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ కొత్త ప్రణాళిక రూపొందించారు.

తెలంగాణలో టిడిపికి మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి కార్యకర్తలలో మంచి జోష్ నింపాలని, అంతేకాకుండా తెలంగాణాలో పార్టీ క్యాడర్ కోసం కొంత సమయాన్ని కేటాయించాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఈ ఉదయం చంద్రబాబునాయుడిని కోరారు. బుధవారం నాడు ఎల్ రమణ అమరావతి రావడం జరిగింది.

ఈ క్రమంలో చంద్రబాబునాయుడను ఆయన కలిశారు. తెలంగాణలో  ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గురించి చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగింది. ఈ క్రమంలో ఎల్.రమణ రాష్ట్రంలో చేపడుతున్న తెలంగాణా రాష్ట్రంలో టిడిపి ఆధ్వర్యంలో జరుగనున్న “పల్లె పల్లె కి టిడిపి” లో పాల్గొని ఆ కార్యక్రమం ద్వారా కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపాలని ఆయన చంద్రబాబు ని కోరారు..దీనికి చంద్రబాబు నుంచి సానుకూల స్పందించడం తో రమణ సంతోషం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు రమణకు సూచించారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: