ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలు తమ ఇష్టం వచ్చి తీరుగా ప్రవర్తిస్తూ..తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకు వస్తున్నారు. కొన్ని సార్లు వారి ప్రాణాలమీదకు తెచ్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ మద్య ఏపీ మంత్రి నారాయణ కుమారుడు అతివేగంగా కారు నడిపి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో పలువురి తనయులు అతి వేగంగా వాహనాలు నడిపి తమ ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమారుడు సాహూల్ ఖాన్ వీరంగం సృష్టించాడు. స్నేహితులతో కలిసి కారులో అతివేగంగా వెళుతూ బైక్ ను ఢీకొట్టారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమంటున్న బాధితులు.... కారులో ఎమ్మెల్యే జలీల్ఖాన్ కుమారుడు సాహుల్ ఖాన్ ఉన్నాడని ఆరోపిస్తున్నారు. ఈ కారు నడిపిన కృష్ణతేజా అనే యువకుడిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అంతేకాక ఈ స్నేహితులు అందరూ మద్యం తాగి డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు.
కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఎమ్మెల్యే జలీల్ఖాన్ కుమారుడు సాహుల్ ఖాన్ అర్ధరాత్రి మాచవరం పోలీస్స్టేషన్లో వీరంగమాడాడు. స్నేహితులతో కలిసి పీఎస్కి వచ్చిన సాహుల్ ఖాన్ ఫొటోలు తీసిన కానిస్టేబుళ్లపై చిందులేశాడు. అయితే మీడియా కెమెరాలు చూడగానే అక్కడ్నుంచి జారుకున్నాడు.