రాను రాను దేశంలో మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా అవి పోలీసుల లా పుస్తకాలు,న్యాయస్థానాలలోని పుస్తకాల వరకే పరిమితం అవుతున్నాయి. శిక్షలు కఠినంగా లేకపోవడం వల్ల తప్పుల మీద తప్పులు చేస్తూ జైలుకు అత్తారింటిలాగా వెళుతూ,వస్తున్నారు. సమాజంలోగల కొన్ని మృగాల వల్ల మొత్తం మగజాతికి తీవ్ర అవమానం కలుగుతుంది. ఎక్కడపడితే అక్కడ,వావి వరసలు లేకుండా, పసికందులను మొదలుకుని పండు ముసలి స్త్రీల వరకు ప్రతీక్షణం, ఎక్కడోకచోట లైంగిక వేధింపులకు గురవుతున్నారు.


తాజాగ కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా  చేసింది. గర్భిణీగా ఉన్న తన భార్యకు సహాయంగా ఉండడానికి వచ్చిన 16 ఏళ్ల యువతిపై ఒక కామాంధుడు రెచ్చిపోయాడు. ఈ నెల 16 వ తేదీ మంగళవారం జరిగిన ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకెళితే కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ చెందిన ప్రభాకర్ భార్య నిండుచూలాలు. తన భార్య సొంత పనులు చూడడానికి ఏ ఒక్క మహిళ లేకపోవడంతో ఆమె తన వరసకు చెల్లి అయ్యే 16 ఏళ్ల యువతిని తనకు సహాయకంగా ఉండేందుకు పిలిపించుకుంది.


ఇలా ఆమెకు సహాయం చేస్తున్న తరుణంలో ప్రభాకర్ కన్ను ఆమె మీద పడింది. తన భార్యకు తెలియకుండా ఆ అమ్మాయిని మరో గదిలోకి లాక్కెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. ఈ  విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఎవరికైనా చెప్తే పరువుపోతుంది, అవమానకరంగా ఉంటుందని భావించిన సదరు యువతి ఇన్నాళ్లు అత్యాచారం జరిగిన విషయాన్ని గోప్యాంగా ఉంచింది. ఎలాగోలా ధైర్యం కూడగట్టుకున్న యువతి జరిగిన సంఘటనను పూసగుచ్చినట్లు పోలీసులకు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రభాకర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: