టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ అంటే పిచ్చిగా అభిమానించే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. హీరోగా ఆయన ఇప్పటి వరకు 25 సినిమాలు పూర్తి చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆ స్థాయి అభిమానం, ఆదరణ పొందిన హీరో పవన్ కళ్యాన్ మాత్రమే అని చెప్పొచ్చు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన హీరోలకు మాస్ ఇమేజ్ ఉన్నా..అది పవన్ కి ఉన్న రేంజ్ లో లేదు. పవన్ కళ్యాన్ సినిమాల్లోనే కాకుండా సామాజిక సేవ చేయాలనే ధృక్పదంతో ‘జనసేన’ అనే పార్టీ స్థాపించి ప్రజల కష్టాలు తీర్చడానికి నేను ఉన్నా అనే భరోసా ఇస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ స్థాపించినా..తాను మాత్రం ప్రత్యక్షంతో పోటీ చేయలేదు. ఇప్పటికీ జనసేన పార్టీ ఆవిర్భవించిన మూడు సంవత్సరాలు దాటుతుంది..ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తం చేసుకుంటున్నారు పవన్ కళ్యాన్. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ కార్యాకలాపాల గురించి కార్యర్తలు, ఫ్యాన్స్ తో ముచ్చటించేందుకు రెండు రోజులు తెలంగాణ యాత్ర కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే కరీంనగర్లో పర్యటించిన ఆయన నేడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఉపన్యాసాలతో తనదైన స్టైల్లో దూసుకెళుతున్నారు. ఇక జబర్థస్త్ కామెడీ షో తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హైపర్ ఆది కి పవన్ కళ్యాన్ అంటే వల్లమాలిన అభిమానం. పవన్ కళ్యాన్ గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో ఎంతో గొప్పగా పొగిడారు. తాజాగా పవన్ కళ్యాన్ పర్యటనపై ఆది ట్వీట్ చేశాడు.
‘‘కల్యాణ్ అన్నయ్య జనంలో ఉంటేనే చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకెక్కడా సంతోషంగా ఉండలేడు. జనంలో ఉంటా జనంలా ఉంటా..’’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్తో పాటు పవన్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం పర్యటనలకు సంబంధించిన రెండు ఫోటోలను పోస్ట్ చేశాడు హైపర్ ఆది.