అయితే ఈ నిధుల విషయం కొన్ని రోజుల క్రిందట ప్రస్తావనకు వచ్చి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే అంశం పై మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఇప్పించవలసిన నిధుల పై విదేశీ సంస్థలతో సమాలోచనలు జరుపుతున్నామని, ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి , సాధ్యమయినంత త్వరగా సాయం అందిస్తామని అన్నారు. అయితే ఆయన మాటలు కర్ర విరగ కుండా పాము చావకుండా మాట్లాడినట్లు అనిపిస్తోందని పలువురు అంటున్నారు. నిన్న దీనికి ప్రతిగా చంద్రబాబు రాసిన లేఖలో ప్రముఖంగా మాకు ఋణం కాదు, నాబార్డు ద్వారా గ్రాంటు ఇప్పించండి అంటూ లేఖ ద్వారా వేడుకున్నారు. నిజానికి రుణానికి, గ్రాంటుకు చాలా తేడా వుంది అని, గ్రాంటు రూపంలో నిధులు వస్తే అవి తిరిగి చెల్లించే అవసరం ఉండదు కాబట్టి చంద్రబాబు గట్టిగా గ్రాంటు ఇప్పించమని అడుగుతున్నట్లు చెపుతున్నారు. లేఖ తయారీ తర్వాత, దానిని పూర్తిగా చదివి చివరిగా సంతకం చేసిన ముఖ్యమంత్రికి అయినా తను చేసిన పొరపాటు తనకు గుర్తుకు వచ్చిందో లేదో అని ప్రశ్నిస్తున్నారు. ఒకనాడు ప్రత్యేకహోదా అంశాన్ని చంద్రబాబు గట్టిగ పట్టుకుని తనవంతుగా కేంద్రం పై వత్తిడి తెచ్చి హోదా సాధించి ఉన్నట్లయితే రాష్ట్రానికి ఇప్ప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని, అప్పుడు ఇలా అడుక్కోవలసిన పనిలేకుండా ఆటోమేటిక్ గా నిధులన్నీ గ్రాంట్ల రూపంలో వచ్చేవని, కానీ చంద్రబాబు ఏ కారణంతో ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి ప్యాకేజి తీసుకున్నారో ఆయనకే తెలియాలని పలువురు అంటున్నారు. ప్రతిపక్ష నాయాకులు హోదా పై మాట్లాడుతుంటే అది ముగిసిపోయిన అంశం దాని గురించి ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని ప్రజల్లో వున్న హోదా స్ఫూర్తిని పూర్తిగా నాశనం చేసిన పాపం ఆయనదే అని చెప్పుకుంటున్నారు.