టీడిపి ఎంపిలు పార్లమెంట్ లో మాట్లాడి, ఎదో ఘన కార్యం చేసినట్లు ఫీల్ అవుతున్నారు. అస్సలు రాష్ట్రానికి ఏం సాధించారని మాత్రం చెప్పరు. కానీ ఇప్పుడు వారు చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తుంటే ప్రజలందరు ఆశ్చర్య పోతున్నారు. ఆదివారం ఉదయాన్న సీఎం చంద్రబాబుతో సమావేశం కోసం ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టిన టీడీపీ ఎంపీలకు ఘన స్వాగతం లభించింది.
గుంటూరు, మంగళగిరిలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఆదివారం జరిగిన విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు జయజయధ్వానాలతో వీరిని ఊరేగించారు. ఈ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ ఎంపీల విగ్రహాలు పెట్టించాలని.. వారి చరిత్రను పాఠాలుగా పుస్తకాలకెక్కించాలని సెటైర్లు వేస్తున్నారు. ఇంతకాలం నోరెత్తకుండా ఊరుకుని, ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన హీరోలయిపోతారా అని మండిపడుతున్నారు.
సత్కారాలు చేసినవాళ్లకు బుద్ది లేకపోతే చేయించుకున్న గల్లా జయదేవ్, రామ్మోహన్ వంటి విద్యావంతులకైనా ఆలోచన లేదా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు… పార్లమెంటులో మాట్లాడడమే గొప్పా..? ఇంతకీ కేంద్రం నుంచి ఏమైనా సాధించగలిగారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. గల్లా జయదేవ పార్లమెంటులో బాగా మాట్లాడితే మాట్లాడొచ్చు కానీ , ఇంతకుముందు ఆయన ఎన్నిసార్లు రాష్ఱ్ట సమస్యలపై చిత్తశుద్ధితో ప్రశ్నలు వేశారన్న చర్చ ఒకటి మొదలైంది.