వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికలు పేరు చెబుతుంటే భయపడుతుంది. ఇతర పార్టీ నాయకులను ప్రత్యర్థులను భయపెట్టే రోజా ఈ సారి వచ్చే ఎన్నికలు అంటుంటే వణికిపోతుంది రోజా. రాబోయే ఎన్నికలలో భవిష్యత్తు ఉండదేమోనని భయపడుతున్నారట రోజా. ఎంతో ధైర్యంగా ఉండే రోజ ఇలా అవడానికి గల కారణం ఏమిటి అంటే నగరి నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించి, అక్కడి ప్రజలకు తలలో నాలుక మాదిరిగా ఉన్న ఎమ్మెల్సీ ముద్దు కృష్ణమ నాయుడు ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.
ఈ పరిణామమే రోజాను ఒణికింప జేస్తోంది. నగరి నియోజకవర్గము నిండా ముద్దు కృష్ణమ సింపతీ పెరిగిపోయింది. ఏ ఇంట్లో చూసినా ముద్దుకు సంబంధించిన చర్చే జరుగుతోంది. చాలాకాలం రాజకీయ అనుభవం ఉన్న నేతగా చిత్తూరు జిల్లాలో ఎదిగిన ముద్దు కృష్ణమ చాలామంది రాజకీయ నాయకులకు ఆప్తుడు...చివరాఖరకు ప్రత్యర్ధి పార్టీ నాయకులు ... జగన్ అత్యంత సన్నిహితుడు వైసీపీ ఎమ్మెల్యే అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ముద్దు కృష్ణమ మరణానికి కంటతడి పెట్టాడు. మరి అదే విధంగా చిత్తూరు జిల్లా వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి కూడా ముద్దు కృష్ణమ మరణం పట్ల సంతాపం చెందాడు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో ముద్దు కృష్ణమ కుటుంబం నుండి ఎవరు దిగిన ఎన్నికల బరిలో కచ్చితంగా గెలుపు ఖాయం అన్నా నేపథ్యంలో... తాను అక్కడ పోటీ చేస్తే గెలిచే మార్గం లేదని.. తనకు వేరే నియోజకవర్గం ఇవ్వాలని.. జగన్ను రోజా కోరానున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా వైసీపీ ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిశోర్ నిర్వహించిన సర్వేలో మాత్రం.. రోజాకు యాంటీగా రిజల్ట్ వచ్చింది.
ఆమె వ్యవహార శైలి మాటతీరు పార్టీకి ఇబ్బందులకు గురిచేస్తుందని జగన్ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్ టీం నిర్వహించిన సర్వేలో తేలిందట. ఈ పరిణామంతో రోజాకు రాష్ట్రంలో ఎక్కడ సీటు ఇచ్చిన ఓటమి గ్యారెంటీ అన్న నేపథ్యంలో... రాజకీయంగా నాకు భవిష్యత్ కనబడట్లేదు అని తనలో తాను రోజా కుమిలి పోతున్నట్టు సమాచారం. మరి రాబోయే ఎన్నికలలో ఏం జరుగుతుందో చూడాలి.