ఎన్నికల వస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు తమ వారసులను రాజకీయ ఆరంగేట్రం చేయడానికి సిద్ధపరుస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత బిజెపి మహిళా నాయకురాలు పురంధేశ్వరి త‌న‌యుడు ద‌గ్గుపాటి హితేష్ చెంచురామ్ టీడీపీలోకి వస్తున్నారని..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లాలో వారి సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్చూరు నుంచి టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు భయంకరంగా షికార్లు చేస్తున్నయి.


అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి వస్తున్న సమాచారం ప్రకారం పురందేశ్వ‌రి త‌న‌యుడు ద‌గ్గుపాటి హితేష్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చే వార్త రూమర్ అని తేలిపోయింది. ఇక చెంచురామ్ నందమూరి బాలకృష్ణ స్వ‌యానా మేన‌ళ్లుడే.


ఈ సందర్భంగా బాల‌య్యే చెంచురామ్‌ను టీడీపీలోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, అంతేకాకుండా చెంచురామ్‌కు ప‌ర్చూరు టిక్కెట్ ఇప్పిస్తున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం తనను తన కుటుంబాన్ని విభేదించే వారిని ఏ మాత్రం తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించేది లేదని బాలకృష్ణ తేల్చిచెప్పారట టిడిపి నాయకులతో.


అల్లుడికి కోరి మ‌రీ బాల‌య్యే స్వ‌యంగా మ‌రో మేన‌ళ్లుడిని పోటీకి ఎందుకు తీసుకు వ‌స్తాడ‌న్న‌ది కూడా టీడీపీ వ‌ర్గాల్లో బాగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. మరి అదే విధంగా ద‌గ్గుపాటి కుటుంబం పార్టీలోకి వస్తే తీవ్ర నష్టాలు జరుగుతాయని తన సన్నిహితుల దగ్గర అన్నారట బాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: