ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిత్రపక్ష పార్టీలు అయిన టిడిపి బిజెపి పార్టీల మధ్య కొంతకాలంగా గ్యాప్ పెరుగుతూ వస్తుంది కొన్ని రాజకీయ పరిణామాల వల్ల. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడు కొడాలి నాని చంద్రబాబునాయుడుకు ఓ సలహా ఇచ్చారు. బిజెపి పార్టీతో విడిపోవద్దని తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ లో విలీనం చేసేయమని ఆయన సూచించారు.


ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కేవలం అధికారం కోసమే పనిచేస్తారని అన్నారు నాని. అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఏ గడ్డి అయిన తింటాడు. అలాగే ఎన్ని అబద్ధాలు చెప్పాలన్న చెబుతాడు అని కొడాలి నాని చంద్రబాబునాయుడు మీద సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కి  గుండెకాయలాంటి ప్రత్యేక హోదా అంశాన్ని తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసాడు చంద్రబాబు.


ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మరి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, హామీలను పట్టించుకోకుండా కేంద్రం ఏది చెప్తే దానికి తలవూపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టేసాడు చంద్రబాబు అని అన్నాడు కొడాలి నాని. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ నేత జగన్ చేసిన ప్రత్యేక హోదా ప్రకటనతో చంద్రబాబునాయుడు గుండె మోకాళ్లలో కి  వచ్చేసింది.


ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఏమీ చేయలేక తెలుగుదేశం పార్టీ ని కాపాడటానికి రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ని తెరమీదకు తెచ్చారు అని అన్నారు కొడాలి నాని. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు ఏదో ఒకటి మాట్లాడి ప్రజలను గందరగోళంలోకి గురిచేస్తున్నారు అన్నారు నాని. ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకని మోసం చేస్తున్న చంద్రబాబు రానున్న రోజుల్లో తగిన ఫలితం అనుభవిస్తారు అని కొడాలి నాని జోస్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: