సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేంద్రంగా ఉండే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మద్య గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) సినిమాతో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు.  ఈ సినిమా విదేశాల్లో తీశారని వర్మ అంటుంటే..లేదు హైదరాబాద్ లోనే కానిచ్చారని..మియా మాల్కనోవా హైదరాబాద్ కి వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.  అయితే జీఎస్టీ రిలీజ్ కి ముందు పలు టివి ఛానల్స్ లో వర్మ డిబెట్ పెట్టారు..ఈ సందర్భంగా మహిళలపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని సామాజిక కార్యకర్త దేవి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. 
Related image
వర్మ క్షమాపణ చెప్పడంతో ఈ సమస్య అయిపోయిందనికున్న సమయంలో విశాఖకు చెందిన మరో సామాజిక కార్యకర్త కేసు పెట్టింది.  ఇలా వరుసగా వర్మపై మహిళలు ఆగ్రహంతో కేసులు పెడుతున్నారు. తాజాగా వర్మ మహిళా సంఘాలతో గొడవపై స్పందించారు. స్త్రీ స్వేచ్ఛ గురించి విశాఖలో మార్చి 8న బహిరంగ సమావేశం నిర్వహిస్తానని ప్రకటించారు. టీవీ9లో తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి సమాధానం చెబుతానన్నారు. తాను కేవలం చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని... తాను ఎక్కడ ఉన్నా తన ఆలోచనలే లోకంగా బతుకుతానన్నారు. ఈ మీటింగ్‌కు వ్యతిరేకంగా తనను విమర్శించే వారు కూడా మరో సమావేశం పెట్టుకోవచ్చన్నారు.
Image result for ram gopal varma police case
తాను 30 ఏళ్ళుగా రకరకాల ప్రయోగాలతో సినిమాలు తీస్తున్నానన్నారు వర్మ. తనకు సామాజిక బాధ్యత కన్నా... చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యే వాటి గురించే సినిమాల ద్వారా రెస్పాండ్ అవుతానని చెప్పుకొచ్చారు. తన దగ్గర గురజాడ చెప్పిన మంచి అన్నది పెంచుమన్న అన్న నీతి బోధలు చేస్తే ఎలా ఉంటుంది? మంచి అనే డెఫినేషన్ తన బుర్రకి వేరన్నారు. తాను అసహనానికి లోనై సంయమనం కోల్పోయి మాటతూలి... ఆ తర్వాత అపాలజీ చెప్పానన్నారు వర్మ.
Image result for gst varma
తన మీటింగ్‌కు మాత్రం యువత, కాలేజీ విద్యార్థులు, మహిళలు, తన ఆలోచనలతో ఏకీభవించేవారు రావాలని పిలుపునిచ్చారు.వర్మ పిలుపు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. వర్మపై ఇప్పటికే మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో విశాఖలో సమావేశం పెడితే... అడ్డుకోవడం అక్కడ గొడవ జరగడం ఖాయంగా కనిపిస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: