ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుండెపోటుతో మరణించింది శ్రీ దేవి అన్నవారు ఇప్పుడు శ్రీదేవి మరణం సాధారణమైనది కాదు అంటున్నారు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ నివేదికలో వచ్చినా ఫలితాలు శ్రీదేవి భర్త బోనీకపూర్ ని పోలీసులు ప్రశ్నిస్తున్న తిరు వీటన్నిటినీ గమనిస్తే శ్రీదేవి మరణం మిస్టరీ గా ఉంది అన్నారు. ఈ  క్రమంలో శ్రీదేవి మరణంపై పలు ప్రశ్నలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


శ్రీదేవిది సహజ మరణమా? ఆత్మహత్యా? లేక హత్యా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే దుబాయ్ పోలీసులు బోనీకపూర్‌ని, హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ శ్రీదేవి భర్త బోనీకపూర్‌ల కాల్ డేటాని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. తొలుత శ్రీదేవి గుండెపోటుతో మరణించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆమె ఆల్కహాల్ అధికమొత్తంలో తీసుకోవడం వల్ల మరణం సంభవించినట్లుగా వెల్లడైంది. శ్రీదేవి అధిక మోతాదులో ఆల్కహాల్ సేవించడంతో అదుపుతప్పి బాత్ టబ్‌లో జారిపడి మృతి చెందినట్లు యూఏఈ గల్ఫ్ న్యూస్ ప్రకటించింది. యాక్సిడెంటల్ డెత్‌గా పరిగణించిన యూఏఈ పోలీసుల.. దర్యాప్తును మరింత క్షుణ్ణంగా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.


 శ్రీదేవి డెత్ మిస్టరి విచారణ దశలోనే ఉంది. మొత్తం విచారాణ పూర్తయ్యేసరికి సమయం పడుతుంది అంటున్నారు... ఈ క్రమంలో శ్రీదేవి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమైన క్రమంలో కేసుని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలింఛి శ్రీదేవి మరణ మిస్టరిని చేదించాలి అనుకుంటున్నారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: