సినీనటుడు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో హీరో శివాజీ భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా మెలిగేవారు. ఐతే కొన్ని అనివార్య కారణాల వల్ల బిజెపి పార్టీ నుండి బయటకు రావడం జరిగింది.
ఈ క్రమంలో బిజెపి నాయకులతో పరిచయం ఏర్పడింది….అయితే తాజాగా శివాజీకి అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే సెప్టెంబర్ నెలకల్లా తెలుగుదేశం పార్టీ కూల్చడానికి బీజేపీ రంగం సిద్ధం చేసింది అని అంటున్నారు. దీనికి బిజెపి ఆపరేషన్ గరుడ అనే పేరు కూడ పెట్టిందన్నారు. ఆపరేషన్ గరుడలో మొదట అధికారపార్టీ నాయకులను కేసులు, ఆర్థిక వ్యవహారాలతో చక్రబంధనం చేస్తారు.
మరో ప్రధాన పార్టీ నాయకుడి పై ప్రాణహని లేని దాడిచేయిస్తారు. తద్వారా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని సెప్టెంబరు 1న కూలదొస్తారు.అవసరం అయితే ఈ దాడికి రాయలసీమకు చెందిన ఓ కుంటుంబమే అని నమ్మిస్తారట. ఈ ఆపరేషన్ ను ఇప్పటికే ప్రారంభం అయ్యింది అని శివాజీ చెేబుతున్నారు.
అంతేకాకుండా రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులపై సిబిఐ కేసులతో ఇబ్బందులకు గురిచేయడంతో పాటు వారిని ఆర్ధికంగా దెబ్బతీయడానికి జాతీయ పార్టీ ప్రణాళికలు సిధ్దం చేసిందట. మొత్తంమీద 2019 ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రధాన దృష్టి పెట్టింది.