ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపీ సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ఆడుతున్న నాటకాలు దారుణమని అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారం కోసం అబద్ధపు హామీలు చెప్పి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న చంద్రబాబు తన స్వార్ధ రాజకీయాలకోసం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టేసి ప్రత్యేక ప్యాకేజీ అని మొన్నటిదాకా డప్పు కొట్టాడు అన్ని అన్నారు.

Image result for vijay sai reddy

అయితే రాష్ట్రంలో ప్రజలందరూ ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్మడంతో అలాగే  ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా మొదటినుండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పడంతో...చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ యూటర్న్ తీసుకున్నారని అన్నారు.

Image result for vijay sai reddy

అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అడ్డుకుంటున్నా కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపకుండా పార్లమెంటులో దొంగ నాటకాలు ఆడారు చంద్రబాబు అని విమర్శించారు విజయసాయిరెడ్డి. టీడీపీ ఎంపీలు కేవలం కేంద్ర మంత్రి పదవులకే రాజీనామా చేశారని హోదాపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

Image result for vijay sai reddy vs chandrababu

చంద్రబాబు నిజంగా ప్రత్యేక హోదా మిద చిత్తశుద్ధి ఉంటే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి ప్రజా తీర్పును కోరదమని సవాల్ విసిరారు. అసలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం రాకుండా కేంద్రానికి దొంగచాటుగా మద్దతు ఇచ్చింది టీడీపీ అన్ని అన్నారు విజయసాయిరెడ్డి. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఎంపీలు చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోరని అన్ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: