ఈ నేపథ్యంలో ఇటీవల దేశంలో నగదు కొరత ఏర్పడడంతో బిజెపి నాయకులపై మండిపడ్డారు లోకేష్. కరెన్సీ కష్టాలపై జైట్లీ చేసిన ట్వీట్లకు కూడా మంత్రి లోకేష్ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. అయితే దేశంలో కావలసిన దానికంటే ఎక్కువగానే నగదు ఉందంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ట్వీట్పై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు.
ఆ సందర్భంలోనే లోకేష్ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఏపీకి చేసిన మోసంపై మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అయితే నారా లోకేష్ చేసిన విమర్శలకు ప్రధాని కార్యాలయం స్పందించింది. సరైన పరిశోధన ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయడం బాధాకరమంటూ నరేంద్ర మోదీ తరపున ట్వీట్ వచ్చింది.
దీంతో లోకేష్ చాలా తీవ్రంగా స్పందించారు ఏపీకి ప్రత్యేక హోదా సహా చట్టంలో పొందుపర్చిన విధంగా ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని తాము ప్రశ్నించామని, బీజేపీ నేతలే ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై బురద చల్లుతున్నారని మోడీకి దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఢిల్లీలో ఉన్న బిజెపి నాయకులు ఏం మాట్లాడలేకపోయారు.