దీంతో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు తెలుగు సినిమా రంగంలో 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు చంద్రబాబు తనయుడు లోకేష్ ట్విట్టర్ వేదికగా పవన్ చేసిన ట్వీట్లపై ప్రతిస్పందించారు. లోకేష్ ఏమన్నారంటే..“పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నాపై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు.
ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ.” అంటూ ట్వీట్ చేశారు.
అయితే మరోపక్క పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు, లోకేష్ మరియు ఎల్లో మీడియాపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది న్యాయమూర్తులతో పవన్ సమావేశమయ్యి మంతనాలు జరుపుతున్నారు.