టాలీవుడ్లో ఆడవారు పడకసుఖం అందిస్తేనే అవకాశాలను కల్పిస్తారు అంటూ సంచలన వాఖ్యలు చేసి వెలుగులోకి వచ్చింది నటి శ్రీరెడ్డి. న్యాయం కోసం ఫిలిం ఛాంబర్ ముందు నగ్న ప్రదర్శన చేసి జాతీయమీడియా దృష్టిని సైతం ఆకర్శించింది. అయితే ఎవరో చెప్పారని జనసేన అధినేతను, ఆయన తల్లిని దూషించి మిత్రులను సైతం శత్రువులుగా చేసుకుని అందరి నుండి విమర్శలను ఎదుర్కొంటుంది.
ఇదిలా ఉంటే నాలాంటి ఆడవాళ్ళకి న్యాయం జరగాలని న్యూస్ స్టూడియోలలో తిష్ట వేసిన ఈ బోల్డ్ నటి, పవన్ ను దూషించిన తరువాత అసలు కెమెరా ముందుకి రావడమే మానేసింది. అయితే తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా పవన్ పై మరియు ఆయనకు మద్దతిస్తున్నవారిపై విరుచుకుపడుతుంది. అయితే ఒకర్ని ఎప్పుడూ విమర్శించే శ్రీరెడ్డి ఈ సారి మాత్రం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తింది.
"మీ ఉప్పు తిన్నదానిగా చెప్తున్నా, జగన్ అన్నా ..రౌడీ రాజకీయాలు చేసేవాళ్ళని కలుపుకోవద్దు. వైఎస్సారన్నా, మీరన్నా జనాల్లో అభిమానం ఉంది. మీరు ఓదార్పు యాత్రలు, బహిరంగ సభలు ఎన్నో నిర్వహించారు. కానీ మీ అభిమానులు ఎన్నడూ హద్దుమీరలేదు. దటీస్ జగన్. ఓర్పు, శాంతి జగన్ ఆయుధాలు" అంటూ పవన్ అభిమానులు స్పందిస్తున్న తీరుకు పరోక్షంగా కౌంటర్ గా రాసుకొచ్చింది.