తనను, తన తల్లిని దూషించడానికి పన్నాగం పనిన అందరినీ చెడుగుడు ఆడేసుకుంటున్నాడు పవన్ కల్యాణ్. నా తల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే నేను చావడమే మేలు అని చెప్పిన పవన్, అన్నట్లుగానే తన అమ్మగారి గౌరవాన్ని, పరువును కాలరాజేసిన ప్రతి ఒక్కరిపైన సమరశంఖం ఊది వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు.


ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా వారిమీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాడు పవన్. అవి నావి కావు, అవన్నీ నిరాధారాలు అని వారు వారిస్తున్న సమయంలో దానికి సంబందించి  ఫోటోలు, వీడియోలూ బయటపెట్టి వారి నోర్లు మూయిస్తున్నాడు. తాజాగా పవన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.


కాగా నిన్న రాత్రి ఆర్కేపై పవన్ చేసిన ట్వీటు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంది. పవన్ ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్ చేసాడో గాని నెటిజన్లు మాత్రం ఆ ట్వీటుకు పగలబడి నవ్వుతున్నారు. ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ- "బాబు నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం, కూర, పప్పు తో పాటు కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా.. అలాగే సంస్కారవంతమైన సబ్బుతో తల స్నానం చెయ్యమని చెప్పండి.." అంటూ వారి ఫ్యామిలీ ఫోటోని జతచేసి ట్వీట్ చేసాడు. రోజూ టీవీ ప్రకటనలలో వచ్చే సంస్కారవంతమైన సబ్బును పవన్, ఆర్కేకి  సూచించడం ట్విట్టర్ జనానికి తెగనవ్వులు పూయిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: