భారత దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యారాచాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కొంత మంది కామాంధులు చిన్నారులు, వృద్దులను సైతం అతి కృరంగా అత్యాచారం చేసి చంపుతున్నారు. ఈ మద్య ఇలాంటి దుర్మార్గులకు ఉరిశిక్ష విధించే చట్టం తీసుకు రావాలని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కదులుతున్న కారులో 16 ఏళ్ల యువతిని గ్యాంగ్ రేప్ చేశారు. రేప్ చేసిన గ్యాంగ్ లో యువతి బంధువు కూడా ఉండటం మరోదారుణం.
ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. ఈ కేసులో ఉన్న ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తాను ఇంటికి నడిచి వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్లు 12వ తరగతి చదువుతున్న ఆ యువతి తెలిపింది. ఈ ఘటన ఏప్రిల్ 18న జరిగింది..కాగా యువతి తన స్కూల్ టైమ్ పూర్తయిన తర్వాత ఇంటికి బయలు దేరే సమయానికి బస్ మిస్ కావడంతో అటుగా వస్తున్న కారు వచ్చిందని..తనను ఇంటి వద్ద దించుతామని చెప్పడంతో కారు ఎక్కానని బాధితురాలు తెలిపింది. కానీ, ఆ దుర్మార్గులు కారు ఎక్కగానే నోట్లో గుడ్డలు కుక్కి ఆ తర్వాత రేప్కు ప్రయత్నించారు.
ఓ మత్తు పానీయాన్ని కూడా ఆమెకు తాగించారు. తమ కూతురు సమయం దాటినా కూడా రాకపోవడంతో అనుమానం వచ్చి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 2 గంటల సమయంలో నాలెడ్జ్ పార్క్ ఏరియాలో మత్తులో ఆ యువతిని గుర్తించారు. హాస్పటల్కు తీసుకువెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఇంటికి పంపారు. సెక్షన్ 376డీ కింద గ్యాంగ్ రేప్ కేసును నమోదు చేశారు.