అయితే ఈ క్రమంలో చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల సానుభూతిని పొందుకోవడానికి చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల విజయవాడలో ధర్మపోరాట దీక్ష...అలాగే తిరుపతిలో కూడా దీక్ష చేయడం జరిగింది.
ఇన్ని దీక్షలు చేసిన చంద్రబాబు ని ప్రజలు నమ్మకపోవడం తో..చంద్రబాబు త్వరలో రాష్ట్ర పర్యటన చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని తెలుస్తుంది. ప్రజా చైతన్య యాత్ర తో త్వరలో రాష్ట్రం మొత్తం పర్యటించనున్నట్టు సమాచారం.
ఈ పర్యటనలో చంద్రబాబు కేంద్రం రాష్ట్రాన్ని ఏవిధంగా మోసం చేసింధో...అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఇప్పటిదాకా ఎన్ని నిధులు ఇచ్చిందో..ప్రజలకు అర్థమయ్యేరీతిలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తెలియజేస్తారని పార్టీ నాయకుల నుండి వస్తున్న సమాచారం. మరి ఈ కార్యక్రమం చంద్రబాబు ఎప్పుడు మొదలుపెడతారో ఇంకా ఎవరికీ తెలియదు. మొత్తానికి త్వరలో చంద్రబాబు రాష్ట్రం మొత్తం పర్యటించనున్నట్లు తెలుస్తుంది.