క‌డ‌ప జిల్లాలో తెలుగుదేశంపార్టీకి షాక్ త‌గిలింది. మొన్న‌టి వ‌ర‌కు వైసిపి నుండి టిడిపిలోకి వ‌ల‌స‌లు జ‌రిగితే తాజాగా అధికార‌పార్టీకి చెందిన జిల్లా పార్టీ అధికార ప్ర‌తినిధి బొల్లినేని రామ్మోహ‌న్ నాయుడు వైసిపిలో చేర‌టం టిడిపి నేత‌ల‌కు నిజంగా షాక్ కొట్టేదే. తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన బొల్లినేని రామ్మోహన్‌నాయుడు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
Bollineni Rammohan naidu Joined in YSRCP - Sakshi
వైసీపీ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి నేతృత్వంలో బొల్లినేని రామ్మోహ‌న్ నాయుడుఅనుచరులు భారీ ఎత్తున వారి స్వగ్రామంలో వైసీపీలో చేరారు. వీరికి ఎంపీ మిథున్‌రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Image result for ys jagan
ఈ ర్యాలీలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, వైసీపీ పట్టణ కన్వీనర్‌ పోలా శ్రీనివాసులరెడ్డి, కొండూరు శరత్‌కుమార్‌రాజు, ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మెన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: