జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవం గడించిన తర్వాతనే ఎన్నికలలో పోటీ చేసేది లేనిది నిర్ణయిస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికే చాలా కాలం అయింది. ఈ మధ్యనే శాననసభ అన్ని స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి ప్రత్యర్థులను అప్రమత్తం చేశారు. 


కానీ ఆయన ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నది ఇంకా ప్రకటించలేదు. అయితే ఆయన ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నది బయటికి లీక్ అయింది. రానున్న సాధారణ ఎన్నికలలో  కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ ఆలోచన చేస్తున్నాడని కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌ ముత్తంశెట్టి కృష్ణారావు తెలియజేసారు.


కృష్ణారావు నిన్న మంగళవారం అవనిగడ్డలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్ పోటీ చేస్తున్న ప్రాంతంపై కీలక వాఖ్యలు చేసారు. అయితే పవన్ పలనా ప్రాంతం నుండి పోటీచేస్తున్న విషయంపై జనసేన కానీ పవన్ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: