ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు పై వ్యతిరేకత భయంకరంగా ఉండటంతో..చంద్రబాబు ప్రజలను నమ్మించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు..దీనిలో భాగంగానే రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటాలు, దీక్షలు, ఉపవాసాలు, జాగరణలు అంటూ రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే తాజాగా జగన్ కృష్ణా జిల్లాల్లో ప్రజా సంకల్ప పాదయాత్ర లో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలోకి వెళ్లడంతో కృష్ణాజిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు షాక్ ఇచ్చినట్లయింది.
మరియు అదే విధంగా కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ తాజాగా బిజెపి ని వీడి వై.సి.పి.లో చేరారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. దీంతో ఆయన అనుచరులు ఎంతగానో సంతోషపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో తెలుగుదేశం నేతల లో గుబులు మొదలయింది...మరోపక్క చంద్రబాబు అనేక అవినీతి కార్యక్రమాలలో అడ్డంగా దొరికిపోవడంతో..చాలా మంది టీడీపీ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.