చంద్ర బాబు నాయుడు తనయుడు నామినేటెడ్ పదవి ద్వారా మంత్రి అయినా సంగతి తెలిసిందే. దీనితో సర్వత్రా విమర్శలు వినిపించాయి. దొడ్డి దారిన మంత్రి అయినా లోకేష్ అని విపక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే ఇప్పుడు 2019 ఎన్నికలు దగ్గర పడ్డాయి. అయితే ఇంత వరకు లోకేష్ పోటీ చేసే నియోజక వర్గం కోసం వేట కొన సాగుతుంది. టీడీపీ కి కంచు కోట లాంటి నియోజక వర్గాలను వెతుకుతున్నారు. హిందూ పురం టీడీపీ కి కంచు కోట లాంటిది. అయితే ఇక్కడ బాలయ్య వల్లన జరగాల్సిన నష్టం జరిగింది.

Image result for lokesh

అయితే ఇప్పుడు నియోజకవర్గం విషయంలో చంద్రబాబుపై లోకేష్ ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోతే లోకేష్‌పై చాలా బ్యాడ్ రిమార్క్ పడుతుంది. వెనుకటికి మన్మోహన్ సింగ్ వంటి మేధావి రాజ్యసభకు నామినేట్ అయ్యి ప్రధాని అయితే చంద్రబాబు ఆయనను నానామాటలన్నాడు. దొడ్డిదారిన ప్రధాని అయ్యాడు.. అంటూ విరుచుపడేవాడు బాబు.

Image result for lokesh

అలాంటి వ్యక్తి నామినేట్ అయితే సహించలేకపోయిన బాబు తన కొడుకుని మాత్రం నామినేటెడ్ పోస్టుతో మంత్రిని చేసుకున్నాడు. రేపటి ఎన్నికల్లో కూడా మళ్లీ నామినేటెడ్ అంటే అది క్యాడర్ లోకి కూడా రాంగ్ ఇండికేషన్స్‌ను పంపుతుంది. అందుకే ఇప్పుడు నియోజకవర్గాన్ని వెదికే పనిలో పడ్డారట. కమ్మ వాళ్ల జనాభా గట్టిగా ఉన్న సీటు కావాలనేది మొదటి షరతు. అందుకు చంద్రగిరి, నగరి వంటి సీట్లను కూడా పరిగణనలోకి తీసుకున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: