జగన్ కు హైదరాబాదుపై ఉన్న ప్రేమ పులివెందులపై లేదంటూ ప్రతిపక్షనాయకుడిని రెండువారాల క్రిందట ఒక ప్రెస్ మీట్లో విమర్శించిన అంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేడు మళ్ళీ ఈ ఆదివారం రోజున మళ్ళీ జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఒళ్ళు కొవ్వెక్కి పాదయాత్ర చేస్తున్నాడంటూ వివాదాస్పద వాఖ్యలు చేశాడు.


ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వాఖ్యలు చేశాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నిరసన ఎదురైతే ప్రతిపక్ష నేత జగన్ ఉలిక్కిపడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశాడు. పట్టిసీమ గురించి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా జగన్ తప్పించుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చాడు.


అధికారదాహంతో జగన్ ఏదిపడితే అది వాగుతున్నాడని ఆయన వాఖ్యానించాడు. మొన్న చిట్టినగర్ సందులో పాదయాత్ర చేస్తూ  జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారని, బాంబులు పెట్టి కొల్లేరును ధ్వంసం చేసిన చరిత్ర ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిదేనని ఆయన విమర్శించాడు. తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదంపై ముగ్గురు సభ్యుల కమిటీ వేశామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన ఈ మేరకు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: