రాజకీయాలలో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం పరిపాటే. ఉదయం లేచినప్పటినుండి అధికార, ప్రతిపక్ష నాయకులు పరస్పరం ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటూనే ఉంటారు. అయితే వీరిలో కొందరు నేతలు మాత్రం కాస్త డోసు పెంచి మరీ వాఖ్యలు చేసి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. ఈ కోవకే చెందుతాడు అంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.


ఒళ్ళు కొవ్వెక్కి జగన్ పాదయాత్ర చేస్తున్నాడు అని వాఖ్యానించిన ఆయన మళ్ళీ వివాదస్పద వాఖ్యలు చేశాడు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎదుట ప్రజలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే రాళ్లదాడి చేసారంటూ జగన్ చెప్పడం సరికాదని ఆయన తెలిపాడు. తిరుపతిలో స్విచ్ వేస్తే జగన్ దగ్గర లైట్ వెలిగిందని మంత్రి దేవినేని ఎద్దేవా చేశారు.


పట్టిసీమ ప్రాజెక్టుపై మాట్లాడుతూ మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్ చేస్తున్న జగన్‌కు అమిత్ షా దేవుడిగా, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్న చంద్రబాబు రాక్షసుడిలా కనిపిస్తున్నారని ఆయన తెలిపాడు. కర్ణాటక ఎన్నికల్లో భాజపా ప్రచారం కోసం వైకాపా నేతలు పనిచేశారని,  విజయసాయిరెడ్డి ఏకంగా డబ్బులు పంచిపెట్టారని ఆయన  ఆరోపించాడు. మరి ఈయనగారి మాటలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో!


మరింత సమాచారం తెలుసుకోండి: