సైలెంట్ గా సింపుల్ గా మొదలయ్యే ప్రభంజనాలు ఇట్లాగే ఉంటాయి. మీడియా నెత్తిన ఎక్కి రూపాయిని పదిరూపాయలు చేసి చూపించడం అలవాటి లేని వారు జనం గుండెల్లో నుంచి నిజమైన హీరోలుగా పుడతారు. అలుపన్నదే లేని నడక సాగుతూనే ఉంది , సాగుతూ కదులుతూ రెండు వేల కిలోమీటర్ల యాత్ర ని జనం కోసం జగన్ పూర్తి చేసేసాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెడుతూ ఈ యాత్ర యొక్క గొప్ప ఘనతని సాధించడం లో జగన్ మోహన్ రెడ్డి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు., రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన సమయంలో అనుభవజ్ఞుడు - మన తలరాతలు మారుస్తాడని అధికారం ఇస్తూ జీవితంలో ఏ మార్పూ చూపించని చంద్రబాబును జనం అర్థం చేసుకునేలా వారికి అర్ధమయ్యేలా చెబుతూ ఇడుపులపాయలో మొదలైన జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర .
ఊరు నుంచి ఊరు జిల్లా నుంచి జిల్లా గ్రామం నుంచి గ్రామం మనిషి నుంచి మనిషి ఇలా అందరినీ కలుపుకుపోతూ సాక్షాత్తూ రాజశేఖర్ రెడ్డి మన కళ్ళముందు మళ్ళీ తిరుగుతూ ఉన్నాడా అనే చందగా అనిపిస్తూ జగన్ దూసుకుని పోతున్నాడు. జనం వదిలిన మిసైల్ ని నేనే అంటూ జగన్ నడుస్తున్న బాట 'సస్య శ్యామల' ఆంధ్ర ప్రదేశ్ కి నాంది పలుకుతూ సూపర్ హిట్ గా సాగుతోంది.
వేసవి. పైగా కోస్తా ప్రాంతం. బయటకు పోవాలంటే... ప్రతి రోజూ ఎండలో పనిచేసే వారు కూడా జంకే పరిస్థితి. నాలుగడుగులు వేస్తే చొక్కా తడిసే చెమటలు. కానీ... అలుపు ఎరుగని పోరాటి పటిమతో జగన్ అడుగులేశాడు. ప్రతీ అడుగు ప్రభంజనంగా మార్చుకునే వారికి ఈ ఎండ వేడి అసలు లెక్క కాదు అన్న చందంగా జగన్ నడక అతని నడక గానే ఆగిపోకుండా ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారుతోంది అని ఏలూరు ప్రజలు చెప్పుకోవడం విశేషం.నవంబర్ 6 2017 న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర.. సోమవారం (161వ రోజున) 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గం వెంకటాపురంలో 2000 కిలోమీటర్ల పైలాన్ ఆవిష్కరిస్తూ...అశేష జనవాహినికి కృతఙ్ఞతలు తెలిపారు జగన్. తనకి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ఆయన థాంక్స్ చెప్పుకున్నారు. రైతులు చొక్కా కాలర్ ఎగరేసుకునే రోజులు రాబోతున్నాయి అంటూ ఆయన ఎంత రైతు బందువు అనేది ఒక్క మాటతో తేల్చేసారు. మన స్పెషల్ కరస్పాండెంట్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఏలూరు లో జగన్ కి జనం బ్రహ్మరథం పట్టారు, వాడ వాడలా జనం తో కిక్కిరిసాయి ఏలూరు రోడ్లు.