వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి జగన్ చేస్తున్న పాదయాత్ర పై సంచలన కామెంట్ చేశారు. ప్రస్తుత రోజులలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇటువంటి వాతావరణంలో ఎక్కడా కూడా కనబడడం లేదని పేర్కొన్నారు...కానీ జగన్ ఇంతటి మండుటెండల్లో కూడా ప్రజల కోసం నడవడం ఎంతో సంతోషం అని అన్నారు...ముఖ్యంగా జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు.

Image result for vijay sai reddy

ఈ క్రమంలో జగన్ చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా విజయసాయిరెడ్డి కూడా పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ 8 జిల్లాలలో యాత్ర ముగించుకుని పశ్చిమగోదావరి జిల్లాలో అడుగు పెట్టారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు, కూలీలు, మహిళలు, నిరుద్యోగులు.. జగన్ కి బ్రహ్మరథం పడుతున్నారు అని అన్నారు విజయసాయిరెడ్డి.

Image result for vijay sai reddy

ముఖ్యంగా ఈ పాదయాత్ర లో జనం చంద్రబాబు చేతిలో మోసపోయామంటూ తమ బాధలను కష్టాలను అధినేత జగన్ కి చెప్పుకుంటున్నారు... జగన్ ను ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నట్లుగా విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న టీడీపీ పాలనకు చరమగీతం పాడాలని భావిస్తున్నారని పేర్కొన్నారు.

Related image

ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో ఓ రాక్షసుడు పాలన జరుగుతుందని...దాని నుండి బయటపడాలని ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని అన్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రలో రాష్ట్రంలో అనేక కొత్త సమస్యలు గుర్తించామని...రాబోవు రోజుల్లో  దేవుడి దయ.. ప్రజల అండ వల్ల... ప్రభుత్వం ఏర్పాటు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని జగన్ కసి మీద ఉన్నట్లు పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.



మరింత సమాచారం తెలుసుకోండి: