అసలు ఢిల్లీ పెద్దలకు కడప అంటే ఏమిటో రుచి చూపించింది వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. కేసులు పెట్టిన జైల్లో పెట్టిన కొత్త పార్టీ స్థాపించి ఎదురీది పోరాడి రాజకీయాలలో అద్భుతంగా రాణిస్తున్నది వైయస్ జగన్ అని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ముందునుండి చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని పేర్కొన్నారు.
కేసులకు భయపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం కాళ్ళదగ్గర తాకట్టు పెట్టింది చంద్రబాబు అని ఈ సందర్భంగా విమర్శించారు అంజద్ బాష. ప్రత్యేక హోదా కోసం వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేశారని తెలియజేశారు.
అధికారం కోసం అబద్దాలు చెప్పి మోసం చేస్తున్నది చంద్రబాబు అని విమర్శించారు. నీతి,నిజాయితీ, విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్నది జగన్ అన్ని అన్నారు...జగన్ ని విమర్శించాలంటే ఒక అర్హత ఉండాలి అది ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు అని పేర్కొన్నారు.