మోడీ గురించి ఇన్ని రోజులు చాలా మందికి మంచి అభిప్రాయం ఉండేది. దేశానికి మంచి చేస్తాడని, అవినీతి మరకలు లేని రాజకీయ నాయకుడని దేశాన్ని అభివృద్ధి చేస్తాడని అధికారం ఇచ్చి అందలం ఎక్కిస్తే కుటీలా రాజకీయాలకు పాల్పడుతూ, రాజ్యాంగానికి విలువలు ఇవ్వకుండా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఇప్పటికీ దేశప్రజలంతా మోదీయే మళ్లీ ప్రధానమంత్రి కావాలని ఆశిస్తున్నారు.మోదీని మించి మరే నేతను కూడా ప్రధానిగా ఊహించుకోలేకపోతున్నారు.
దేశవ్యాప్తంగా దిగ్గజనేతలు ఉన్నప్పటికీ ప్రధాని స్థాయిలో ఎవరైతే బాగుంటుందని ఊహించుకుంటే నరేంద్రమోదీ మినహా మరే నేత కనిపించటం లేదని ప్రజలు చెప్తున్నారు.కానీ అలాంటి నమ్మకాన్ని మోదీ కర్నాటకతో పోగొట్టుకున్నట్లే కదా.. గతంలో అద్వాణీకి నమస్కరించకుండా,కనీసం కన్నెత్తి చూడకుండా వెళ్తున్న వీడియో ఒకటి నరేంద్రమోదీ అహాన్ని బయటపెట్టింది. తాజాగా కర్నాటకలో అవలంభించిన వైఖరి కూడా ఆయన ప్రతిష్టను గంగపాలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే, బలనిరూపణ పరీక్షలో యడ్యూరప్ప ఓడిపోయారు.ఓడిపోతారని ముందే తెలుసు,కానీ కాంగ్రెస్,జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకోవాలని భావించి భంగపడింది బీజేపీ.ఇక మిగిలిన అంశం ఒక్కటే.. కాంగ్రెస్,జేడీఎస్ ల కూటమిని గవర్నర్ ఆహ్వానించడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం.