అయితే తాజాగా ఎన్నికలు మరో సంవత్సరంలో వస్తున్న నేపథ్యంలో..పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యకు రావడంతో చంద్రబాబు ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత అంతా పవన్ కళ్యాణ్ పై చూపించేస్తున్నారు. ఈ సందర్భంగా మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ని ప్రజలు ప్రశ్నలతో కడిగి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రజాపోరాట యాత్రలో ఓ మహిళ పవన్ కళ్యాణ్ కి దిమ్మ తిరిగిపోయే ప్రశ్నలు వేసింది.
ఆమె ఏమందంటే….గత ఎన్నికల ప్రచారంలో ప్రచారంలో భాగం నీవు ( పవన్ కల్యాణ్), చంద్రబాబు కలిసి మా ఊరుకు వచ్చారు. మీ ఊరికి అది చేస్తాం.. ఇది చేస్తామంటూ మా వద్ద ఓట్లు రాబట్టుకున్నారు. చివరకు ఓట్లు వేయించుకుని గెలిచిన తరువాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు.. నీవేమో (పవన్ కల్యాణ్) సినిమాలు చేసుకుంటూ కోట్ల సంపాదన గడించావు.
చివరకు మేమే ఏమీ కాకుండా పోయామంటూ తన ఆవేదనను వెలిబుచ్చింది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయంలో మళ్ళీ వచ్చావు ఈసారి కూడా పోయినసారి చెప్పిన మాటలే..హామీలే చెబుతున్నావు, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే అమలు చేయలేదు. మళ్లీ కొత్తగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారా..? అంటూ ప్రశ్నించింది. ఆ మహిళ అడిగిన ప్రశ్నలకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి దిమ్మ తిరిగిపోయింది. అక్కడ ఉన్న అభిమానులు కూడా ఆమె అడిగిన ప్రశ్నలకు ఏమీ చేయలేకపోయారు.