బెంగుళూరులో చంద్రబాబునాయుడు హడావుడి ఎక్కువైపోయింది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేస్తుంటే చంద్రబాబు హడావుడి పడిపోతున్నారు అదేదో సామెతలో చెప్పినట్లుగా. బుధవారం సాయంత్ర విధానసౌధలో కుమారస్వామి సాయంత్రం 4 గంటలకు కుమారస్వామి సిఎంగా బాధ్యతలు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా బిజెపికి వ్యతిరేకులైన పలువురిని కుమారస్వామి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి, అధ్యక్షుడు రాహూల్ గాంధితో పాటు ఆహ్వానాలు అందుకున్నవారిలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్, తెలంగాణా సిఎం కెసిఆర్, ఏపి నుండి చంద్రబాబునాయుడు, తెలంగాణా నుండి కమలహాసన్ వామపక్ష నేతలు తదితరులున్నారు.
బెంగుళూరుకు చేరుకున్న చంద్రబాబు
కార్యక్రమంలో పాల్గొనేందుకా అన్నట్లుగా ప్రముఖుల్లో అత్యధికులు ఈరోజు ఉదయమే బెంగుళూరుకు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యతిరేకులంతా ఒకేచోట హాజరయ్యారు కాబట్టి సందు దొరికిందనుకున్న చంద్రబాబు హడావుడి మొదలుపెట్టేశారు. ఎటుతిరిగి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కొత్తగా కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడుతూ ధర్మపోరాటం మొదలుపెట్టిన విషయాన్ని చంద్రబాబు ప్రముఖులను కలిసి వివరిస్తున్నారు.
మోడికి వ్యతిరేకంగా హడావుడి చేస్తున్న చంద్రన్న
మమత బెనర్జీతో ప్రత్యేకంగా సమావేశమై మోడికి వ్యతిరేకంగా తాను అమలు చేస్తున్న అజెండాను వివరించినట్లు సమాచారం. ఏపికి గడచిన నాలుగేళ్ళుగా కేంద్రం ఏ విధంగా మోసం చేసింది అన్న విషయాలను కూడా వివరించినట్లు సమాచారం. బిజెపి, ఎన్డీఏకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరంపై కూడా చర్చించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బిజెపి వ్యతిరేక శక్తులు ఏకమవ్వాల్సిన అవసరంపై పలువురు ప్రముఖులతో చంద్రబాబు చర్చించారు. అయితే, వారిలో ఎవరు ఏ విధంగా స్పందించారన్నది స్పష్టంగా తెలీదు. ఎందుకంటే, మొన్నటి వరకూ ప్రధానమంత్రి నరేంద్రమోడిని, కేంద్రప్రభుత్వాన్ని చంద్రబాబు ఏ విధంగా వెనకేసుకొచ్చింది అందరూ చూసిందే. ఇపుడేదో మోడితో చెడింది కాబట్టే ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చారన్న విషయం అందరికీ బాగా తెలుసు. కాకపోతే మోడి వ్యతిరేకంగా చంద్రబాబు గళం విప్పుతున్నారు కాబట్టి చెప్పిందంతా విన్నారంతే.