దేశంలో 40 ఏళ్లరాజకీయానుభవం ఉన్న ఏకైక నాయకుడిని నాకు అప్పట్లో ప్రధాని పదవి వచ్చిన కాదన్న వాడిని అంటూ ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మామూలుగానే చంద్రబాబు పబ్లిసిటీ కోసం ఎంతకైనా ఒడిగడతారు అన్ని మనకందరికీ తెలుసు దీనిలో భాగంగానే తెలుగు రాష్ట్రాలలో ఉన్న మీడియాని తన గుప్పెట్లో పెట్టుకుని తనకు ఎదురు వచ్చే చాలామంది జీవితాలపై బురదజల్లడం వంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు.
Related image
అంతేకాకుండా ఎక్కడైనా చంద్రబాబుకి మైక్ వస్తే ప్రపంచపటంలో అది పెట్ట దాన్ని నేనే కనిపెట్ట అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూనే ఉంటారు. తాజాగా ఇటీవల పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి పదవి కోరి వస్తే... తానే కాదన్నానని ఆయన గొప్పలు పోయారు. అది కూడా ఒకసారి కాదని - ఏకంగా పీఎం పదవి తనను రెండు సార్లు వరించి వచ్చిందని చంద్రబాబు తెలియజేశారు.
Image result for chandrababu modi
ఈ నేపద్యంలో భారతీయ జనతాపార్టీ  రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చంద్రబాబు చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు. చంద్రబాబుకి ప్రధాని పదవి వచ్చింది అని అనటం శుద్ధ అబద్ధమని...ఆయనను ప్రధానిగా ఏ ఒక్కరూ అప్పట్లో ప్రతిపాదించలేదని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి జరుగుతోందని..గుడి అని బడి అని...ఆఖరికి దేవుడు మెడలో ఉన్న హారాలను కూడా దోచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Image result for chandrababu modi
అయితే ఈ క్రమంలో జీవీఎల్ నరసింహారావు చేసిన ఒక కామెంట్ దిమ్మతిరిగిపోయింది. అదేమిటంటే అప్పట్లో ప్రధాని ఆఫర్ వచ్చిందన్న చంద్రబాబు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గదిలోకి వెళ్తే చేతులు కట్టుకుని నిలబడతారని అంత మర్యాద ఎందుకు ఇస్తారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: