అంతేకాకుండా ఎక్కడైనా చంద్రబాబుకి మైక్ వస్తే ప్రపంచపటంలో అది పెట్ట దాన్ని నేనే కనిపెట్ట అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూనే ఉంటారు. తాజాగా ఇటీవల పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి పదవి కోరి వస్తే... తానే కాదన్నానని ఆయన గొప్పలు పోయారు. అది కూడా ఒకసారి కాదని - ఏకంగా పీఎం పదవి తనను రెండు సార్లు వరించి వచ్చిందని చంద్రబాబు తెలియజేశారు.
ఈ నేపద్యంలో భారతీయ జనతాపార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చంద్రబాబు చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు. చంద్రబాబుకి ప్రధాని పదవి వచ్చింది అని అనటం శుద్ధ అబద్ధమని...ఆయనను ప్రధానిగా ఏ ఒక్కరూ అప్పట్లో ప్రతిపాదించలేదని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి జరుగుతోందని..గుడి అని బడి అని...ఆఖరికి దేవుడు మెడలో ఉన్న హారాలను కూడా దోచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ క్రమంలో జీవీఎల్ నరసింహారావు చేసిన ఒక కామెంట్ దిమ్మతిరిగిపోయింది. అదేమిటంటే అప్పట్లో ప్రధాని ఆఫర్ వచ్చిందన్న చంద్రబాబు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గదిలోకి వెళ్తే చేతులు కట్టుకుని నిలబడతారని అంత మర్యాద ఎందుకు ఇస్తారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.