తెలుగు చానెల్స్ కొన్ని ముఖ్యముగా ఆంధ్ర జ్యోతి, టివీ 5 అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నాయని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. ఆంధ్ర జయితే అయితే ప్రతి పక్ష పార్టీ మీద బురద చల్లడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటుంది. అయితే ఇప్పడ స్ట్రింగ్ ఆపరేషన్ లో ఈ రెండు చానెల్స్ డబ్బులు తీసుకోని వార్తలు రాయడానికి ఒప్పుకున్నట్లు దొరికిపోయినారు. తమ గొప్పలు చెప్పుకొనే ఈ మీడియా ఇప్పుడు మీడియా పరువునే తీసి పడేశాయి.
5 కోట్ల వరకు బ్లాక్ మనీ ఇస్తే హిందుత్వ అజెండాకు అనుగుణంగా వార్తలు ప్రసారం చేస్తామని ఆంధ్రజ్యోతి,TV 5 ప్రతినిధులు ఒప్పుకున్నారు. ఇలాంటి పనులు చేయడంలో తమది అందెవేసిన చేయి అంటూ వారు చెప్పుకొచ్చారు.కోబ్రా పోస్టు అంటేనే సంచలనాలకు వేదిక. తాజాగా ‘ఆపరేషన్ 136 పార్ట్ 2’ అనే పేరుతో కోబ్రాపోస్ట్ ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. డబ్బులు తీసుకుని హిందుత్వ అజెండాకు అనుగుణంగా వార్తలు ప్రచురించేందుకు 17 మీడియా సంస్థలు అంగీకరించాయంటూ కోబ్రాపోస్ట్ వెబ్సైట్ వెల్లడించింది.
తాము నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఆ సంస్థల బండారం బయటపడిందని కోబ్రాపోస్ట్ ఎడిటర్ అనురుద్ధ బహల్ ప్రకటించారు. హిందుత్వ భావజాల రాజకీయాలకు అనుకూలంగా మూడు నెలలపాటు నిర్విరామంగా వార్తా కథనాలు ప్రసారం చేయాలని, అందుకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని మీడియా సంస్థలను కోబ్రాపోస్టు రిపోర్టర్ కోరారు.ఐదు కోట్ల వరకు బ్లాక్ మనీ ఇస్తే తాము ఈ పని చేసి పెడతామని తెలుగు వార్తా చానళ్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 ప్రతినిధులు ఒప్పుకున్నారు. ఇలాంటి పనులు చేయడంలో తమది అందెవేసిన చేయి అంటూ వారు చెప్పుకొచ్చారు.