కార్యకర్తలు, నేతలతో సంబంధం లేకుండా టీడీపీలోని ప్రతి ఒక్కరూ పండగలా భావించి జరుపుకొనే మహానాడు నేడు రెండవ రోజును పూర్తిచేసుకొంది. నేడు జరిగిన ఈ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు కేంద్ర మాజీ మంత్రి అశోక్ జగపతిరాజు, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే బుట్టా రేణుకతో పాటు తదితరులు హాజరయ్యారు.


కాగా నేడు జరిగిన ఈ మహానాడు కార్యక్రమం మొత్తం నవ్వులతో విరగబూసింది. టీడీపీ తెలంగాణ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి మాటలకు అధ్యక్షుడు చంద్రబాబుతో సహా అక్కడున్న అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. మోడీ నుండి జగన్ వరకు అందరిపైనా సెటైర్లు వేస్తూ నవ్వులు పండించాడు. కేసీఆర్ పాలన పేపర్లలో, టీవీలలో చూస్తే కడుపు నిండినట్లుంటది కానీ బయట చూస్తే కడుపు మండినట్లుంటది అని ఎద్దేవా చేశారు. 


మోడీ గురించి ప్రస్తావిస్తూ మోడీ హయాంలో అచ్చేదిన్‌ కాదు, దేశానికి సచ్చేదిన్ వచ్చిందని సెటైర్లు వేసాడు. పిల్లలకు తండ్రి మోసం చేస్తే నువ్వు తండ్రివా మోడీవా అని అడిగే పరిస్థితి ఉందని పిట్టకథ చెప్పి అందరినీ నవ్వించాడు. ఇక జగన్ గురించి చెప్పిన జోకులకు బాబు పడిపడి నవ్వారు. జగన్ పాదయాత్ర ముద్దుల పోటీనా, గుద్దుల పోటీనా అని అర్ధం కావడంలేదన్నాడు. సీటుకోసం పరితపిస్తున్న జగన్ ఏ సీట్ దొరికిన కూర్చుండే స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశాడు. వైస్ చనిపోతూ సీఎం సీటు ఇస్తాడని జగన్ అనుకుంటే సిబిఐ ని ఇచ్చి వెళ్లినందుకు బాధపడుతున్నాడని చెప్పి అందరిని నవ్వించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: